top of page

ప్రెస్ నోట్ - ది. 30/05/2022,

అధిక ధరలు పన్నుల భారాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ లో ధర్నా

ఈ సందర్భంగా సీపీఎం నందిగామ టౌన్ కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ

  1. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధించిన సెన్సులు రద్దు చేయాలి. ఎక్సైజ్ సుంకం తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలి.

  2. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. నిత్యవసర. బట్టలు. చెప్పులు. పై జిఎస్టి తగ్గించాలి. స్టీల్ సిమెంటు. ఇసుక ధరలు అదుపు చేయాలి.

  3. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి. వ్యవసాయ విద్యుత్ మోటార్లుకు మీటర్లు బిగించేందుకు ఆపివేయాలి.

  4. అసని తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి వెంటనే పరిహారం చెల్లించాలి.

  5. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉపసంహరించుకోవాలి.

  6. పెంచిన బస్ చార్జీలు తగ్గించాలి.

  7. ఆస్తి విలువ ఆధారిత. చెత్త పనులు ఉపసంహరించుకోవాలి.

  8. టోల్ టాక్స్ పెంపుదల ఉప సంహరించు కోవాలి.

  9. డిపోల్లో 14రకాల నిత్యావసర వస్తువులు చౌకగా అందించాలి.

  10. నగదు బదిలీ పథకాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి.

  11. ఉపాధి హామీ పథకంలో రెండు కోట్ల పని విధానం రద్దు చేయాలి.

  12. కౌలు రైతులు అందరికీ నష్టపరిహారం చెల్లించాలి.

  13. పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టాలి.

  14. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలి. నిరుద్యోగ భృతి కల్పించాలి.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, జి.గోపినాయిక్, కరి.వెంకటేశ్వరరావు, m.శ్రీనివాసరావు, j.దమోదర్, J.రవి,నాగమల్లేశ్వరి, ఉపుతోళ్ల.కుమారి, స్వామి, శీను, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

© 2022 CPI(M) నందిగామచే సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

సందర్శకుల సంఖ్య:

ఈ సైట్ CPI(M) నందిగామ చే అభివృద్ధి చేయబడింది & నిర్వహించబడుతుంది.

bottom of page